గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ప్రాపర్టీలను ప్రభుత్వం… బ్లాక్ లిస్ట్ లో చేర్చింది ..రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు నిషేధిత జాబితాలో చేరాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్లను ప్రభుత్వం 22-Aలో చేర్చింది.
ఇది ఇలా ఉండగా దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఉన్నట్టుండి ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.ఆస్తులను అమ్ముకోలేక కలెక్టరేట్ల చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్పేట్, అమీర్పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, శ్రీనగర్ కాలనీ, SR నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, బహుదూర్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే ప్రాపర్టీస్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చారు…
తెలంగాణ వ్యాప్తంగా 22-Aతో లక్షల ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలోకి చేర్చారు.అందులో 54 శాతం కేవలం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ఆస్తులే కావటం గమనార్హం. ఈ ఆస్తులపై ఇప్పటికే హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ ఇవ్వగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో బ్యాంకులు ఆందోళనలో పడ్డాయి.









