హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన.నిర్వాహకులు పాకాల దూర్గ ప్రసాద్.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో : భద్రాచలం: ఏప్రిల్ 30 : టుడే 9 ప్రతినిధి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భద్రాచలంలో భారీ హిందూ సమ్మేళన సభ మే మూడో తారీఖున స్థానిక కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు పాకాల దుర్గాప్రసాద్. విలేకరుల సమావేశం లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప లోపల కులం. గడప దాటితే మనమంతా హిందువులం. అనే నినాదంతో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు
సమాజంలో ఉన్న భేదాలను పక్కన బెట్టి ఐక్యంగా నిలబడే సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అనిఅన్నా రు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ సమ్మేళనం చరిత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. కులాలు మతాలు వృత్తులు ఏవైనా మనమందరం హిందువులమే అని సాటి చెప్పటానికి ఒక వేదిక మీదకు రావాలని నిర్వాహకులు ఈసభ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణాచలం నాగ స్వామి. ఎం ఈ సుబ్రహ్మణ్యం. నాగభూషణ శాస్త్రి. కుంజా సంతోష్. గోపి. కిషోర్.ఎం శ్రీనివాసరెడ్డి.సిద్ధార్థ. సంజయ్. తదితరులు పాల్గొన్నారు.







