ప్రైవేట్ పాఠశాలల ఏకపక్ష ఫీజుల పెంపు, పుస్తకాల బలవంతపు అమ్మకాలపై విచారణ జరపాలి.

*జిల్లా కలెక్టర్ కు కర్నె. బాబురావు వినతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూలై 22
టుడే 9 ప్రతినిధి

పినపాక ఏజెన్సీ ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం, పాఠశాల విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక సేవకులు కర్నె బాబురావు ఆరోపించారు.

ఈ మేరకు ఆయన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అంకిత కి వినతి పత్రం అందజేశారు.

*ఫిర్యాదులో ప్రధాన అంశాలు.

  1. *ఏకపక్ష ఫీజుల పెంపు. పాఠశాల విద్యా నిబంధనల ప్రకారం ఫీజు పెంచే ముందు తల్లిదండ్రుల కమిటీ ఆమోదం, డి ఈ ఓ అనుమతి తప్పనిసరి. అయినా మణుగూరు మండల పరిధిలోని పలు ప్రైవేట్ స్కూళ్లు 25% నుండి 50% వరకు ఏకపక్షంగా ఫీజులు పెంచుతున్నాయి.
  2. నోటీసు బోర్డులో ఫీజుల ప్రదర్శన లేదు: విద్యాహక్కు చట్టం సెక్షన్ 13(1) ప్రకారం ప్రతి స్కూల్ నోటీసు బోర్డుపై ఫీజు వివరాలు పెట్టాలి. కానీ కొన్ని పాఠశాలలు దీన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి.
  3. పుస్తకాల బలవంతపు అమ్మకాలు: కొన్ని పాఠశాలలు నిర్దిష్ట పుస్తక స్టాళ్లతో కుమ్మక్కై తల్లిదండ్రులను అక్కడే పుస్తకాలు కొనాలని బలవంతపెడుతున్నాయి. మార్కెట్ ధర కంటే 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  1. అనుమతి లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.
  2. పుస్తక స్టాళ్లతో కుమ్మక్కైన స్కూళ్లు, స్టాళ్లపై విచారణ జరిపి లైసెన్సులు రద్దు చేయాలి.
  3. అన్ని పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించేలా ఆదేశాలు జారీ చేయాలి.
  4. జిల్లా విద్యాశాఖ అధికారి 19-06-2026న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం స్కూల్ యూనిఫాం, స్టడీ మెటీరియల్, పుస్తకాలను స్కూళ్లలో అమ్మకూడదన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలి.

విద్యను వ్యాపారంగా మార్చకుండా, తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు