భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.:బూర్గంపాడు మే 01: టుడే 9 ప్రతినిధి
మేడే సందర్భంగా ఫిమాకం ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కడారు వెంకటేశ్వరరావు యూనియన్ జనరల్ సెక్రెటరీ పి వి వి ఎస్ ఎన్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులకు టీ షర్టులను యూనియన్ గుర్తుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ సభ్యులు ఎం.వి చిరంజీవి రావు, కే నాగేశ్వరరావు, యాగయ్య తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ గడ్డం వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్ పాండవుల ఉపేందర్, లక్ష్మీనారాయణ, చందర్రావు, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కడారు వెంకటేశ్వరరావు, ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహ్వానితులుగా నల జాల సత్యనారాయణ, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










