ఒక ప్రకటన ద్వారా తెలియజేసిన ఐ టి డి ఏ పి బి రాహుల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.:భద్రాచలం: ఏప్రిల్ 21: టుడే 9 ప్రతినిధి
2026-27 విద్యా సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి చెందిన అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్ధులకు 3, 5 & 8 వ తరగతులలో ప్రవేశము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ పథకంలో 3 వ తరగతి కి (78) సీట్లు, 5 వ తరగతి కి (39) సీట్లు, మరియు 8వ తరగతి కి (39) సీట్లు, మొత్తం సీట్లు (156) కలవని, ఇట్టి ప్రవేశంనకు ధరఖాస్తు ఫారములు సహాయ గిరిజన సంక్షేమ అధికారి దమ్మపేట, భద్రాచలం, ఇల్లందు, కార్యాలయంల నుండి DD(TW), ITDA, భద్రాచలం కార్యాలయం నుండి పొందవచ్చునని, ఇట్టి ఫారంనకు విద్యార్థి యొక్క కులం, నివాసం తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000/- లోపు గ్రామీణ ప్రాంతాలు రూ.2,00,000/- లోపు పట్టణ ప్రాంతాల వారు కలిగి ఉన్న వార్షిక (మీ సేవ) ద్రవీకరణ పత్రాలు ధరఖాస్తుకి జత పరచి 07.05.2026 లోపు ఉపసంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు సమర్పించవలసి ఉంటుంది , ప్రవేశమునకు ఎంపిక లాటరీ పద్ధతిలో ది.14.05.2026 న ఐ టి డి ఏ, భద్రాచలం కార్యాలయం నందు నిర్వహించబడునని ఆయన అన్నారు. , ఆసక్తి గల గిరిజన విద్యార్థినీ విద్యార్థులు పైన తెలిపిన గడువు తేదీ లోపు ధరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ, ఐ టి డి ఏ. భద్రాచలం కార్యాలయం నందు మాత్రమే సమర్పించవలెనని ఆయన కోరారు.









