ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వార్తలు ప్రసారం చేస్తే సహించం…. మంత్రి పొన్నం ప్రభాకర్ …
కొన్ని ఛానళ్లు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే ఆధారాలతో బయటపెట్టాలని, కుట్రపూరిత కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవాస్తవాలతో రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆధారాలు లేకుండా మొసలి కన్నీరు కార్చే వారిపై కఠిన చర్యలు తప్పవని పొన్నం స్పష్టం చేశారు.
Post Views: 34







